Thursday, May 16, 2024

భార్యే దేవత .. ఇంట్లోనే గుడి కట్టి పూజిస్తున్న భర్త

కాకినాడ,ప్రభన్యూస్ బ్యూరో: .భార్య చనిపోయినా ఆమె జ్ఞాపకాలను మరువకుండా ఉండేందుకు తన భార్య ప్రతిరూపాన్ని ఇంటిలోనే పెట్టుకుని అందరికీ ఆదర్శం అయ్యాడు కాకినాడకు చెందిన ఏపీఎస్పీ రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్  బుర్రా వీరభద్రo. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట గ్రామం రమణ రావు కాలనీలో నివాసముంటున్న మూడవ ఏపీఎస్పీ  రిటైర్డ్ ఆర్ ఎస్ ఐ బుర్ర వీరభద్రం మాణిక్యాంబ లు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ,కుమారుడు ఉన్నారు. సంవత్సరంన్నర క్రితం అంతుపట్టని రోగంతో హఠాత్తుగా ఆయన భార్య    మృతి చెందిoది.మృతి చెందిన భార్య మాణిక్యమ్మను, ఆమె జ్ఞాపకాలను మరవకుండా  భార్య ప్రతిమను టేకు చెక్క తో తయారు చేయించి ఆమె  ప్రతిబింబాన్ని ఓ శిల్పితో తయారు చేయిoచాడు. . వేద పండితుల  పూజా కార్యక్రమాలతో ఆమె ప్రతిమ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరే రామ హరే కృష్ణ భజన బృందం పాల్గొని రామకీర్తనలు భజన బృందముతో రామ సంకీర్తనలు చేయిస్తున్నారు . పోలీస్ అధికారిగా నిత్యం విధినిర్వహణలో కుటుంబాన్ని పట్టించుకునే తీరిక ఉండేది కాదని తన భార్యే అన్నీ చూసుకునేదని ఆయన కన్నీటితో చెప్పారు. ఆమె విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందని, దీంతో ఆమె జ్ఞాపకాల కోసం ఆమె విగ్రహాన్ని తయారు చేయించి దేవతగా పూజిస్తున్నా అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. నిజంగా నేటి సమాజంలో ఆ మాజీ పోలీస్ భార్య అదృష్టదేవత కాగా ఆ మాజీ పోలీస్ అధికారి ఆదర్శనీయుడు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement