Thursday, May 2, 2024

పేదల సంపాదనంతా తాగడానికే ఖర్చవుతోంది: జవహర్

ఏపీలో మద్యపానం నిషేధం అమలుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం రేట్లను పెంచి మహిళల తాళిబొట్లను తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఇటు అమ్మకాలను కూడా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాకా మాటా తప్పారని ఫైర్ అయ్యారు. పేదల సంపాదనంతా తాగడానికే ఖర్చవుతోందని… దీంతో, వారు కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మద్యం ధరలను పెంచి పేదల రక్తం తాగుతున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జవహార్. మద్యానికి అలవాటు పడిన వారు దాన్ని మానలేక… ఇంట్లో మహిళలను వేధిస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement