Wednesday, May 8, 2024

పరిషత్ ఎన్నికలకు టీడీపీ దూరం?!

ఏపీలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిషత్‌ ఎన్నికలపై పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల బహిష్కరణపై పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది.

కాగా, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్‌గా నిన్న బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ…వెంటనే షరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్‌ఈసీతో భేటీ అయ్యారు. పరిషత్‌ ఎన్నికలపై చర్చించారు. కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. ఈ ఎన్నికల విషయమై ఎస్‌ఈసీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement