Tuesday, May 7, 2024

హైకోర్ట్ లో బాబు క్యాష్ పిటిషన్

ఏపీ హైకోర్టులో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ ను చంద్రబాబున దాఖలు చేశారు. రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 23 న విచారణకు హాజరుకావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది.

సిఐడి ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. రేపు లేదా ఎల్లుండి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు అందిన నేపథ్యంలో ఆయన కూడా హై కోర్ట్ లో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement