Monday, May 6, 2024

క్రికెట్‌ టోర్నమెంట్‌ను పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలు

నెన్నెల : నెన్నెల మండలంలోని జోగాపూర్‌ గ్రామంలో కొక్కిరాల రఘపతిరావు మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ను ట్రస్టు నిర్వాహకురాలు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని 15 గ్రామపంచాయితీలకు చెందిన జట్లు, 255 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. క్రీడల వల్ల మానసిక ప్రశాంతంత కల్గుతుందని, శారీరక దారుడ్యాన్ని పెంచుతాయని, స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయని అన్నారు. నెన్నెల మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, నెన్నెల మండల అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. క్రీడాకారులంతా ఈ టోర్నమెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెన్నెల మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జనగామ తిరుపతి, గుండ్ల సోమారం ఎంపీటీసీ దాగామ రమేష్‌, బెల్లంపల్లి నియోజకవర్గ ఎస్సీసెల్‌ సెక్రటరి మల్లేష్‌, మహిళా నాయకురాలు మల్లిక దేవి, జంగల్‌పేట ఎంపీటీసీ గొలుసుల శిరీష, మాజీ సర్పంచ్‌ సింగతి తురుపతి, యూత్‌ అధ్యక్షుడు లావుడ్య
రమేష్‌, సహకార సంఘం డైరెక్టర్‌ బియ్యాల లింగయ్య, మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి గౌడ్‌, మైనార్టీ అధ్యక్షుడు మోహిత్‌ ఖాన్‌, ఓబీసీ అధ్యక్షుడు వెంకటేష్‌, గట్టు బానేష్‌, రమేష్‌, లక్ష్మణ్‌, శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement