Thursday, May 2, 2024

Suryapet : పేద విద్యార్థికి మంత్రి జగదీష్‌ రెడ్డి ఆపన్నహస్తం

సూర్యాపేట, ప్రభ న్యూస్ : పేద విద్యార్థికి మంత్రి జగదీష్ రెడ్డి అండగా నిలిచారు. లండన్ లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేశారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ నజీర్ తండ్రి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నజీర్ తల్లి ఇళ్ల‌ల్లో పనిచేస్తూ ఇద్దరు కొడుకులు, కూతురును చదివించుకుంది. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన పెద్ద కొడుకు నజీర్ ఇటీవల లండన్ లో ఐసీయూ స్పెషలిస్ట్ గ్రేడ్-5 మేల్ నర్స్ గా ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం సాధించడం సంతోషమే అయినా నజీర్ కు లండన్ కు వెళ్ళే స్తోమత లేక ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి విన్నవించారు. నజీర్ ఉద్యోగ వివరాలను, కుటుంబ స్థితి గతులను అడిగి తెలుసుకొని మంత్రి జగదీష్‌ రెడ్డి చేతుల మీదుగా వెయ్యి ఫౌండ్ లను(ఒక లక్ష రెండు వేల రూపాయలు) అందజేశారు. లండన్ పోలేనని నిస్పృహలో ఉన్న తనకు వెళ్లేందుకు రవాణా ఖర్చులతో పాటు అక్కడ ఉండేందుకు నెల రోజల పాటు సరిపడ ఆర్ధిక సహాయం చేసిన మంత్రి జగదీష్ రెడ్డికి నజీర్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement