Wednesday, May 1, 2024

‘సుడోకు’ గేమ్ సృష్టికర్త ఇక లేరు

పాపుల‌ర్‌ ప‌జిల్ గేమ్ సుడోకును సృష్టించిన మాకి కాజి (69) క‌న్నుమూశారు. బైల్ డ‌క్ట్ క్యాన్స‌ర్‌తో ఆయ‌న మ‌ర‌ణించారు. మాకి కాజిని గాడ్‌ఫాద‌ర్ ఆఫ్ సుడోకోగా పిలుస్తారు. చిన్న‌పిల్ల‌ల కోసం నెంబ‌ర్స్‌తో ప‌జిల్‌ను త‌యారు చేశారాయ‌న‌. సుడోకో ఆట‌లో 1 నుంచి 9 మ‌ధ్య నెంబ‌ర్ల‌ను.. అడ్డం, నిలువుగా.. రిపీట్‌కాకుండా ప్లేస్ చేస్తారు. 2004 సంవ‌త్స‌రంలో సుడోకో గేమ్ సూప‌ర్‌హిట్ అయ్యింది. నిఖోలి కంపెనీకి కాజి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు.

కాగా టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో మాకి కాజి తుది ప్రాణాలు విడిచారు. త‌న ప‌జిల్స్ గురించి ప్ర‌చారం చేసేందుకు కాజి సుమారు 30 దేశాల్లో ప‌ర్య‌టించారు. 100 దేశాల్లో 20 కోట్ల మంది సుడోకు ఛాంపియ‌న్‌షిప్‌లో పాల్గొన్నారు. కాజికి భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్యే అంత్య‌క్రియ‌లను పూర్తి చేశారు. నిఖోలి కంపెనీ సిబ్బంది కోసం నివాళి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: ఫీజులు వ‌సూలుకాక‌.. అప్పులు చెల్లించ‌లేక‌.. దంపతుల ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement