Monday, April 29, 2024

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాల వారిగా త‌గ్గింపు ఇలా..

కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే రాష్ట్రాల‌ను కూడా త‌గ్గించుకోవాల‌ని సూచించింది. కాగా, కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెప్పిన‌ట్టు చార్జీలు త‌గ్గించాయి. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 వ‌ర‌కు తగ్గిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం అదివ రేటు తగ్గించడంతో పలు రాష్ట్రాలు అదే ప‌నిని అనుస‌రిస్త‌న్నాయి.

కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలుపుకొంటే అసోంలో పెట్రోల్ ధ‌ర‌ 12 రూపాయలు, డీజిల్ ధ‌ర 17 రూపాయలు తగ్గిన‌ట్లు తెలుస్తుంది.. త్రిపురలో సీఎం విప్లవ్‌ దేవ్ కూడా పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కర్నాటకలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 7 చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. తమ రాష్ట్రంలో 7చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. దీంతో గోవాలో పెట్రోల్‌ ధర 12 రూపాయలు, డీజిల్‌ ధర 17 రూపాయల మేర తగ్గింది.

మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ తమ రాష్ట్రంలో పెట్రోల్‌పై 7 రూపాయలు, డీజిల్‌పై 7 రూపాయల వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సైతం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని యూపీలో పెట్రోల్‌, డీజిల్‌ 12 రూపాయల మేర తగ్గనుంది. గుజరాత్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 7 రూపాయల చొప్పున తగ్గించింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను హర్యానా ప్రభుత్వం తగ్గించింది.

కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని హర్యానాలో పెట్రోల్, డీజిల్ 12 రూపాయలు తగ్గాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 3 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. బిహార్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై రూపాయి 30 పైసలు, డీజిల్‌పై రూపాయి 90 పైసలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై 2 రూపాయలు వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement