Thursday, May 16, 2024

TS: కేంద్ర మంత్రి స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ వెంక‌టేష్‌

లోక్ స‌భ‌ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేత‌, ఎంపీ బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి సోమవారం కాషాయతీర్థం పుచ్చుకునున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ వెంకటేష్ నేతకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ… వెంకటేష్ నేతకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, దేశరక్షణ, హిందూ ధర్మ రక్షణ కోసం మోడీ విశేష కృషి చేస్తున్నందున బీజేపీలో చేరానన్నారు. మూడోసారి భారతదేశానికి మోడీ ప్రధాని కావడం ఖాయమని, 400 పైగా స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement