Sunday, May 5, 2024

టీడీపీ అభ్యర్థిపై దాడి.. ఏపీ ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన లేఖలో ఆరోపించారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్ పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్ పత్రాలు చించివేశారని పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందన్నారు. ఈ దాడిలో 30 మంది వరకు పాల్గొని వెంకటేశ్ ను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. వెంకటేశ్ సెల్ ఫోన్ లాగేసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరారు. స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: చెర‌కు రైతుల‌కు బ‌కాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స స్పష్టీకరణ

Advertisement

తాజా వార్తలు

Advertisement