Wednesday, May 8, 2024

యువత క్రీడల్లో రాణించాలన్న సీఐ క‌రుణాకర్

యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని ఆ రంగంలో రాణించాలని సీఐ కరుణాకర్ రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని యతి రాజారావు పార్కు మైదానంలో తెలంగాణ బేడ బుడగ జంగాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వాహకులు తూర్పాటి సాయి ముఖేష్, తూర్పాటి మెండిస్ లతో కలిసి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను సిఐ కరుణాకర్ రావు, జెడ్పీ ఫ్లోర్ లీడ‌ర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. క్రీడలు దేహధారుడ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. స్నేహపూరిత వాతావరణంలో క్రీడాపోటీల్లో పాల్గొనాలన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. క్రీడాకారులు గెలుపోటములు పట్టించుకోకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగాలన్నారు. తెలంగాణను క్రీడాహబ్‌గా రూపొందించేందుకు సీఎం కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించారన్నారు. క్రీడల సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అత్యున్నతమైన నూతన క్రీడా విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య కోసం 0.5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు.

ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, టిఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు ముద్దసాని సురేష్, నాయకులు మాడుగుల పూలమ్మ, కిన్నెర పాండు, రాయి పెళ్లి వెంకన్న, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బసన బోయిన మురళి యాదవ్, ఉపేందర్, క్రీడాకారులు స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement