Friday, April 26, 2024

రాజ‌ధాని ఉద్యమం: రైతుల‌ది కాదు టీడీపీ కార్యకర్తలదే

అమరావతి రైతులు‘న్యాయస్థానం టు దేవస్థానం’ అంటూ  చేపట్టిన పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ‌ధాని ఉద్యమం రైతుల‌ది కాదని, టీడీపీ కార్యకర్తలదే అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టిడిపి వాళ్ళు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. టిడిపి రాష్ట్ర వినాశనంకి పాల్పడుతుందని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కి ఒక రాజకీయ సిద్ధాంతం లేదని విమర్శించారు. బిజెపి, జనసేన కలిసి ఉండి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement