హైదరాబాద్, ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులపై కవిత మంగళవారం ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న కేసీఅర్, రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని సూచించారు. కేంద్రం పంజాబ్లో వడ్లు 100 శాతం కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానం ఉండాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..