ఇవ్వాల ఈద్-ఉల్-అదా(బక్రీద్)ను ముస్లింలు జరుపుకుంటున్నారు. దీంతో ఉదయం నుండి సోషల్ మీడియా శుభాకాంక్షలతో నిండిపోయింది. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా వారి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అట్లానే షారుఖ్ ఖాన్ కూడా ఈ శుభ సందర్భంగా తన టెర్రస్లో కనిపించాడు. అయితే., ప్రతి సంవత్సవరం ఈద్ కి షారుఖ్ తన టెర్రస్ నుండి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తాడు..
అది ఒక సంప్రదాయంలా వస్తోంది. ఇవ్వాల కూడా షారుఖ్ వైట్ టీషర్టును ధరించి, డెనిమ్తో జీన్స్ తో అభిమానులను అలరించాడు. అతని కుమారుడు అబ్రామ్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.