Saturday, May 4, 2024

పాములు బాబోయ్ పాములు

ఎవరికైనా ఒక్కపామును చూస్తేనే చాలా భయం. అదే కుప్పలు తెప్పలుగా పాములను చూస్తే ఇంకేమైనా ఉందా? ప్రాణాలు గాల్లోకి వెళ్లాల్సిందే. మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణకొత్తపల్లిలోని ఒకటో నంబర్ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం భారీ సంఖ్యలో పాములు బయటపడ్డాయి. అంగన్‌వాడీ కార్యకర్త శ్రీజ్యోతి సరుకులు తీసేందుకు భవనాన్ని తెరవగా మూడు పాముపిల్లలు కన్పించాయి. స్థానికులకు చెప్పడంతో వారు బండలను తొలగించగా సుమారు 30 పాము పిల్లలు, రెండు తేళ్లు బయటపడటంతో గ్రామంలో కలకలం రేగింది. వెంటనే పాము పిల్లలను స్థానికులు కొట్టి కొట్టి చంపివేశారు. సమయానికి ఆ గదిలో పిల్లలు లేకపోవడంతో పెద్ద పెను ముప్పు తప్పింది. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement