Monday, May 6, 2024

ఎంపిటిసి, జ‌డ్సీటిసి ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లే – మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌కు హైకోర్టు నో…

అమ‌రావ‌తి – ఎపిలో ఎంపిటిసి, జ‌డ్పీటిసి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు వీలుగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది.. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ క‌మిష‌న‌ర్ ను ఆదేశించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ లు విచారించిన హైకోర్టు దీనిపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు నిరాక‌రించింది.. ఈ పిటిష‌న్ లు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదికి వాయిదా వేసింది.. ఈ లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌తివాద‌లను ఆదేశించింది.. కాగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఈ నెల 31వ తేదిన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయ‌న హ‌యాంలో ఈ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు లేవు…కొత్త క‌మిష‌న‌ర్ వ‌చ్చిన త‌ర్వాత ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement