Friday, April 26, 2024

నోటిఫికేషన్స్ విడుదల చేయలేకపోతే రాజీనామా చెయ్: ష‌ర్మిల‌

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తన పోరును కొనసాగిస్తున్నారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హకీంపేట ఫాతిమా కాలనీలో నివసించే జునైద్‌ ఇక్బాల్‌ ఒస్మాని(28) అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్యపై షర్మిల స్పందించారు. విష‌యానికి సంబంధించి వ‌చ్చిన ఓ వార్త‌ను ష‌ర్మిల పోస్ట్ చేశారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఇక్బాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్తాపం చెంది ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడ‌ని అందులో తెలిపారు. ‘సివిల్ ఇంజి‌నీరింగ్ చేసి కూడా ఉద్యోగాలు దొరకక నిరాశలో తమ్ముడు ఇక్బాల్ ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న. ఇది కేసీఆర్ చేసిన హత్య. వందల సంఖ్య‌లో నిరుద్యోగులు చనిపోతుంటే ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి, రాక్షసానందం పొందుతున్నాడు కేసీఆర్. ఇంకెంత మందిని చంపుతవ్ దొరా? నోటిఫికేషన్స్ విడుదల చేయలేకపోతే రాజీనామా చెయ్’ అని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: గవాస్కర్ టీ20 జట్టు.. ఓపెనర్ గా కోహ్లీ-రోహిత్

Advertisement

తాజా వార్తలు

Advertisement