Thursday, April 25, 2024

గుంటూరులో మరో దారుణం.. భర్తను చితకబాది భార్యపై గ్యాంగ్ రేప్

గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ గృహిణిపై కొందరు దుండగులు గ్యాంగ్‌ రేప్‌‌కు పాల్పడ్డారు. భర్తను కొట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు.. గుంటూరు పట్టణంలో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మేడికొండూరు క్రాస్‌ రోడ్‌ సమీపంలో ఈ దాడి జరిగింది.

బైకుపై వెళ్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి ఆమె భర్తపై దాడికి దిగారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి.. గ్యాంగ్‌ రేప్‌‌కు పాల్పడ్డారు. బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ఎట్టకేలకు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఏకంగా 10 మంది నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. వారినిపై గురువారం నాడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement