Monday, March 25, 2024

‘ఆచార్య’: టార్గెట్ దీపావళి..

అపజయమే ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తీస్తున్న చిత్రం ‘ఆచార్య’..ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నిటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీపావళి పండుగ సందర్భంగా నవంబర్లోనే విడుదల చేయాలనే ఒక ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. చిరూ – చరణ్ ఇద్దరూ కూడా ఒక ఆశయం కోసం పోరాడే నక్సలైట్లుగా కనిపించనున్నారు. చరణ్ పోషించిన ‘సిద్ధా’ పాత్ర ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి వచ్చిన ‘లాహే .. లాహే ..’ సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. త్వరలోనే మరో సింగిల్ ను వదిలే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చరణ్ – పూజ హెగ్డేపై చిత్రీకరించిన యుగళగీతం .. చిరూ కాంబినేషన్లో చిత్రీకరించిన రెజీనా ఐటమ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: RC15: పాన్ ఇండియా మూవీ లాంచ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement