Sunday, May 19, 2024

స‌మ్మ‌త‌మే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా – మంత్రి కేటీఆర్

హీరో కిరణ్ అబ్బ‌వ‌రం, హీరోయిన్ చాందిని నటించిన తాజా చిత్రం సమ్మతమే. ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. యూజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మ్మ‌త‌మే చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 4:05కి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట తారాక రామారావు హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం జూన్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాకు పూర్తి మద్దతు తెలిపారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో సమ్మతమే చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమాపై మరింతగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి కిరణ్ అబ్బవరం హిట్ కొట్టనున్నట్టు అర్థమవుతోంది హీరోయిన్ గా ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని నటిస్తోంది. వీరిద్దరూ క్రిష్ణ, సాన్వి అనే ప్రేమికుల పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement