Wednesday, May 8, 2024

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. స్పాట్ లోనే ఇద్ద‌రు మృతి

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : కారు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చ‌నిపోయారు. ఈ ఘటన శనివారం రాత్రి అప్పా జంక్షన్ సమీపంలోని అజీజ్ నగర్ పాత రోడ్డు వద్ద జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు హైదరాబాద్ నుండి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది.

దీంతో కారు బస్సు కిందికి వెళ్లడంతో అందులో ఉన్న ఇద్దరు కారులో ఇరుక్కుపోయి చ‌నిపోయారు. కారును బస్సు నుండి వేరు చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడాల్సి వచ్చింది. క్రేన్ సహాయంతో కారును వేరు చేయాల్సి వచ్చింది. ప్రధాన రోడ్డు పై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మృతులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement