Saturday, April 27, 2024

రోహిత్‌ శర్మ రికార్డు

శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా సంప్రదాయ క్రికెట్‌లోనూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్‌ తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన రెండో భారత్‌ సారథిగా నిలిచాడు. అంతకుముందు పాలీ ఉమ్రిగర్‌ ఈ ఘనత సాధించాడు. అతని నేతృత్వంలో 1955-56లో న్యూజిలాండ్‌ మీద భారత్‌ ఇన్సింగ్స్‌ మీద 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజాగా మొహాలీ వేదికగా.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల భారీ తేడాతో విజయ భేరి మోగించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement