Sunday, May 19, 2024

కుటుంబంతో తిరుమల శ్రీవారి సేవలో రోహిత్ శర్మ.. వైరల్ గా వీడియో

ఆసియా కప్ ఈ నెల (ఆగస్ట్) 30 నుండి ప్రారంభం కానుంది. టీమిండియా మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో జరుగుతుంది. ఇక‌, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఆసియా కప్ కోసం తమ జట్టులను ప్రకటించాయి. కాగా, త్వరలో బీసీసీఐ కూడా భారత జట్టును కూడా ప్రకటింనుంది. అయితే ప్ర‌స్తుతం భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. ఇప్పుడు జ‌రుగుతున్న‌ టీ20 సిరీస్‌ నుంచి విరాట్-రోహిత్ సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.

కాగా, ప్రస్తుతం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అతని కుటుంబ సభ్యుల వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం రోహిత్ శర్మ తిరుమల శ్రీవారి నీ దర్శించుకున్నారు . ఆసియా కప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి తిరుమల ఆలయానికి సందర్శించారు. భారత కెప్టెన్‌తో పాటు భార్య రితికా సజ్దేహ్, అతని కుమార్తె కూడా వీడియోలో కనిపించారు.

కాగా, రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే, విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement