Thursday, May 2, 2024

గ‌ర్జించే సింగం.. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస‌మూర్తి క‌న్నుమూత‌

స్టార్ హీరోలు సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల‌కి డ‌బ్బింగ్ చెప్పే డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి క‌న్నుమూశారు. ముఖ్యంగా హీరో సూర్య సింగం చిత్రంలో డైలాగ్స్ అంతగా పాపులర్ అయ్యాయి అంటే అందులో శ్రీనివాస మూర్తి అందించిన పవర్ ఫుల్ వాయిస్ పాత్ర ఎంతైనా ఉంది. సింహాన్ని నువ్వు పేపర్ లో చూసి ఉంటావు, టివిలో చూసి ఉంటావ్ .. కానీ గంభీరంగా నడవడం చూశావా.. జూలు విప్పు కసిగా వేటాడడం చూశావా.. అంటూ సూర్య నిజమైన సింగం లాగా గర్జించిన ఆ వాయిస్ శ్రీనివాస మూర్తిదే. సూర్య, మోహన్ లాల్, అజిత్, రాజశేఖర్ లాంటి హీరోలకు ప్రేక్షకులు శ్రీనివాస మూర్తి గొంతుతో అలవాటు పడిపోయారు. ఆ హీరోలకు శ్రీనివాస్ మూర్తి మరణం తీరని నష్టం అనే చెప్పాలి. అపరిచితుడు, సింగర్ సిరీస్, అలవైకుంఠపురములో చిత్రంలో జయరామ్ కి, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కి ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల వెనుక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస మూర్తి పాత్ర ఉంది. శ్రీనివాస మూర్తి హఠాన్మరణంతో ఆయన సన్నిహితులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement