Wednesday, May 8, 2024

సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందింది. హైదరాబాద్‌ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ అనూష (27) కారు డ్రైవర్‌ శివ మరో ముగ్గురు మహిళా సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు కలిసి కారులో గోవాకు వెళ్లారు. కాగా, వారు తిరిగి వస్తుండగా జిల్లాలోని కోహీర్‌ మండలం చింతల్‌ ఘాట్‌ 65 జాతీయ రహదారిపై నిలిచిన లారీని ఢీ కొట్టింది. అనూష తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్ పాతబస్తీలో యువకుడిపై కత్తిపోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement