Saturday, May 4, 2024

నేషనల్‌ జుడిషియల్‌ కమిషన్‌(ఎన్‌జేఏసీ)ను పునరుద్ధరించాలి : విజయసాయి

నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ను పునరుద్ధరించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణను చేపట్టాలని కోరుతూ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుని ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పోస్టింగ్‌లపై తుదినిర్ణయం తీసుకునేందుకు ఎన్‌జేఏసీని పునరుద్ధరించడం ఈ బిల్లు లక్ష్యమని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124, 217, 222ను సవరించాలని ప్రతిపాదిస్తూ విజయసాయి ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement