Sunday, May 12, 2024

IPL | 42 స్కోర్‌‌కు మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..

ఐపిఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, చిదంబరం స్టేడియం వేదికగా జరుగుత్న మ్యాచ్‌లో ఆర్సీబీ 42 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఐదవ ఓవర్లో ఎం రెహమాన్ బౌలింగ్ లో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రజత్ పాటిదార్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఇక ఆరవ ఓవర్లో దీపక్ చాహర్ బౌలింగ్ లో మాక్స్‌వెట్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లీ, కెమరాన్ గ్రీన్ ఉన్నారు. 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది ఆర్సీబీ జట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement