Sunday, May 5, 2024

డబీర్ పేటకు చేరుకున్న‌ రాకేశ్ మృతదేహం

రాకేశ్ మృతదేహం ఆయన సొంత గ్రామం నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం డబీర్ పేట చేరుకుంది . రాకేశ్ మృతదేహంతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి, ఆరూరి రమేశ్, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, సీతక్క ద‌బ్బీపూర్ కు వెళ్లారు. మంత్రులు రాకేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా రాకేష్ కుటుంబానికి అండ‌గా ఉంటుంద‌ని మంత్రులు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement