Tuesday, May 7, 2024

వైఎస్ఆర్ ని స్మ‌రించుకున్న రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ … దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. వైఎస్సార్ దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అని కీర్తించారు. వైఎస్సార్ చిరస్మరణీయ నేత అని అభివర్ణించారు.

ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, వైఎస్ ఆర్ మ‌ర‌ణించిన త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పార్టీ ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి గాంధీ కుటుంబం నుంచి పెద్ద‌గా వైఎస్ ఆర్ పేరు విన‌బ‌డ‌లేదు.. ఏ ఒక్క జ‌యంతికి నివాళుల‌ర్పించిన దాఖలాలు లేవు.. తొలిసారిగా రాహుల్ గాంధీ మ‌హానేత వైఎస్ కు నివాళుల‌ర్పించ‌డం విశేషంగా భావిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement