Tuesday, April 30, 2024

Nandyala : అవుకు చల్లా నివాసం వద్ద ఉద్రిక్తత

నంద్యాల జిల్లా అవుకులోని చల్లా నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. అవుకు మండల జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి, ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మికి సంబంధించిన ఫోన్ పర్సనల్ డేటాను బయటకు తీసి తనను అవమానాలకు గురి చేశారని మీడియా ముందు వాపోతూ చల్లా శ్రీలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలకు సరైన రక్షణ లేదంటూ చల్లా శ్రీలక్ష్మి వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement