Saturday, April 27, 2024

Minister : మోడీ ప్రసంగంపై మంత్రి జగదీష్ నిప్పులు

వరంగల్ లో.. ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారన్నారు. మరొసారి తెలంగాణ మీద, సీఎం కేసీఆర్ మీద తన అక్కసు వెళ్లగక్కారన్నారు. అవినీతిలో కాంగ్రెస్ ని బీజేపీ మించిందన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి.. మీ పాలనకు సాక్ష్యమన్నారు. కేసీఆర్ కుటుంబంపై మోడీ అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. రాఫెల్ కుంభకోణం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరాపెట్టిన బడా బాబులే నీ కుటుంబ సభ్యులన్నారు.

కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు మోడీ అన్నారు. చైతన్యవంతమైన వరంగల్ ప్రజల ముందు నీ అబద్ధాలు ఎవరూ నమ్మరన్నారు.కేంద్రం సహా బిజెపి పాలిత రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాహుల్ గాంధీ పెద్ద దద్దమ్మ అన్నారు. రాహుల్, మోడీ ఇద్దరూ దొంగలేనని… దేశం నాశనానికి కారకులు వీరేన్నారు. అవినీతికి రారాజులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సర్కార్ పని అన్నారు. తెలంగాణలో.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల మనసులో స్థానమే లేదన్నారు. కేసీఆర్ మాత్రమే.. బీజేపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడబోతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement