Wednesday, May 1, 2024

Tirupati : జీ 20 మేయర్ల సదస్సులో వై ఎస్సార్ కు నివాళి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరుగుతున్న జీ 20 : అర్బన్ 20 మేయర్ల సదస్సు ఈ రోజు స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించింది. త్వరలో జరగనున్న జి 20 దేశాల సన్నాహాలలో భాగంగా ఈ రోజు అహ్మదాబాద్ లో మేయర్ 20 పేరుతో జాతీయ, అంతర్జాతీయ సిటీ మేయర్ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొన్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమం జరిగింది.

ఈ సందర్బంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ హరి వెంకట కుమారి, దేశానికి చెందిన పలు నగరాల మేయర్లతో సహా భూటాన్, జపాన్ సిటీ మేయర్లు కూడా ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ మరణాంతర పరిణామాల్ని ఈ సందర్బంగా అక్కడి వారంతా గుర్తు చేసుకున్నామని, సీఎంగా వైఎస్ తో తమకున్న జ్ఞాపకాల్ని అందరికీ తెలియజేసి పదిలపర్చుకున్నామని డాక్టర్ శిరీష తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement