Wednesday, May 1, 2024

కాంస్య పతకంలో గోపీచంద్‌ పాత్ర లేదు: సింధు

ఒలింపిక్స్‌లో వరుసగా రెండో సారి పతకం సాధించిన పీవీ సిందుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే తాను పతకం గెలవడంలో పీవీ సింధు మాజీ కోచ్ పుల్లెల గోపిచంద్ పాత్ర లేదని చెప్పిన సింధు..కోచ్‌ను మార్చడంపై తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. గోపీచంద్‌ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదన్న సింధూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నానని చెప్పింది. ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నాననీ… ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది సింధు. టోక్యోలో కాంస్యం గెలిచాక గోపీచంద్‌ సర్‌ ఫోన్‌ చేయలేదనీ… కంగ్రాట్స్‌ అంటూ సందేశం మాత్రం పంపించారనీ చెప్పింది. తానుకూడా థాంక్స్‌ చెప్పాననీ వెల్లడించింది సింధు.

టోక్యోలో తాను సాధించిన ఈ కాంస్య పతకంలో గోపీచంద్‌ పాత్ర లేదని తేల్చి చెప్పింది సింధు. ఏడాదిన్నరగా పార్క్‌ శిక్షణ ఇస్తున్నాడనీ… ఒలింపిక్స్‌ కోసం ఫిబ్రవరి నుంచి పార్క్‌తో కలిసి పనిచేస్తున్నాననీ చెప్పింది. అక్కడ్నుంచి గోపీ భాగస్వామ్యం లేదని తెలిపింది. పార్క్‌ పూర్తిగా తనకు మాత్రమే శిక్షణ ఇచ్చారనీ… ఈ పతకం ఘనత ఆయనదేనని స్పష్టం చేసింది సింధు.

ఇది కూడా చదవండి: ఈనెల 15న మార్కెట్‌లోకి ఓలా స్కూటర్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement