Friday, March 29, 2024

ఈనెల 15న మార్కెట్‌లోకి ఓలా స్కూటర్ విడుదల

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని ఆ సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ మంగళవారం ప్రకటించారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న స్కూటర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. స్కూటర్ ఫీచర్లు, బుక్ చేసుకున్న వారికి ఎప్పుడు డెలివరీ చేస్తారు? వంటి వాటికి సంబంధించిన వివరాలను ఆ రోజే అనౌన్స్ చేస్తామన్నారు. కాగా రూ.499 నాన్ రీఫండబుల్ అమౌంట్‌తో జూలై 15న ఓలా స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కాగా ఓలా స్కూటర్‌ను రూ.499లతో బుక్‌ చేసుకునే అవకాశాన్ని కంపెనీ అధికారులు కల్పించారు. దీంతో తొలి 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్‌లు అందాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్న ఈ స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేగం, ఛార్జింగ్‌, బూట్‌ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమైనదిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 10 రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. సదరు రంగులను ఇటీవలే ఓలా కంపెనీ బహిర్గతం చేసింది.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో 24 నకిలీ యూనివర్సిటీలు.. ఈ జాబితాలో ఏపీలోని ఓ యూనివర్సిటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement