Thursday, April 18, 2024

సినీ పరిశ్రమలో విషాదం.. సింగర్ కళ్యాణి మీనన్ మృతి

సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ తల్లి, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ కళ్యాణి మీనన్ (80) అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో కళ్యాణి మీనన్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి మీనన్.. తమిళం, మలయాళంలో 100కి పైగా సినిమాల్లో పాటలు పాడారు. 1990, 2000 సంవత్సరాల మధ్యకాలంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దేవరాజన్, విద్యాసాగర్ సంగీత సారథ్యంలో ఆమె ఆలపించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ‘కాదలన్’, ‘ముత్తు’, ‘ఏక్ దీవానా థా’ లాంటి చిత్రాలలో ఆమె పాడిన పాటలకు భారీ క్రేజ్ దక్కింది. ఎక్కువగా ఏఆర్ రెహమాన్ సినిమాలకు పాటలు పాడిన కళ్యాణి మీనన్.. జేసుదాసుతో కూడా కలిసి పనిచేశారు. సినిమాలతో పాటు పలు ప్రైవేట్ డివోషనల్ సాంగ్స్ కూడా కళ్యాణి మీనన్ ఆలపించారు.

ఈ వార్త కూడా చదవండి: ఎర్రకోటకు వచ్చే అతిథులు ఎవరో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement