Monday, May 6, 2024

మలేసియా ఓపెన్ ప్రాకార్వ‌ర్ట్స్ లో రాణించిన ప్ర‌ణ‌య్, సింధు..

రెండుస్లారు ఒలింపిక్‌ మెడలిస్టు, భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధు, థామస్‌ కప్‌ స్టార్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రికార్వర్ట్స్‌లో అద్భుతంగా రాణించారు. క్వార్టర్‌ఫైనల్స్‌కి దూసుకెళ్లారు. అన్‌సీడెడ్‌ ప్రణయ్‌, వరల్డ్‌ నం.4 తైవాన్‌ క్రీడాకారుడు చౌ టిన్‌ చెన్‌ను 21-15, 21-7 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. క్వార్టర్‌ఫైనల్‌కి చేరాడు. ఇండోనేసియా సెవెన్త్‌ సీడ్‌ జోనాటన్‌ క్రిస్టేతో తలపడనున్నాడు. అటు పీవీ సింధు గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి పిటయ్‌పోర్న్‌ చైవాన్‌పై 19-21, 21-9, 21-14 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఓడినా, తర్వాతి రెండు గేమ్‌ల్లో ఆధిక్యంతో క్వార్టర్స్‌ చేరింది.

ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకాలు సాధించిన పీవీ సింధు, క్వార్టర్‌ ఫైనల్‌లో తైవాన్‌ క్రీడాకారిణి తై-జు-యింగ్‌తో తలపడనుంది.
మరోవైపు సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ థాయిలాండ్‌ క్రీడాకారుడు కున్లావుట్‌ విటిడ్సర్న్‌ చేతిలో 19-21, 10-21 తేడాతో ఓటమిని చవిచూశాడు. తొలుత సూపర్‌గా ఫైట్‌ చేసిన కశ్యప్‌ ఆతర్వాత చేతులెత్తేశాడు. ఇషికా జైశ్వాల్‌- శ్రీవిద్య గురజాడ జోడీ 12-21, 8-21 తేడాతో ద్విజయంతి ఘని, రిబ్కా సుగిర్టో చేతిలో పరాజయం పాలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement