Thursday, May 2, 2024

ప్రభాస్, ప్రశాంత్‌లపై ప్రశంసల వర్షం.. ‘సాలార్’ షూటింగ్ పూర్తి చేసిన శృతి హాసన్.

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సాలార్.. ఈ మూవీలో ప్రభాస్ జంటగా శృతి హాసన్‌ కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఆద్య అనే పాత్రలో కనిపించనుంది. కాగా, ఈ అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీ లో నటిస్తున్న శృతి హాసన్‌ ఇవ్వాల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అవును, ఈ ప్రాజెక్ట్ నుండి తన పోర్షన్‌ షూటింగ్‌ను ముగించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా నటి పంచుకుంది. ఆమె షూట్‌ను ముగించినప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడతో కలిసి సెట్స్ లో దిగిన ఒక మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) ఫోటో కూడా షేర్ చేసింది.

ఇక ‘సాలార్ ఒక ప్రత్యేక చిత్రం’ అంటూ శృతి ఇలా రాసింది, ”అండ్ ఇది నాకు సాలార్‌లో మూవీలో ఒక ర్యాప్, నన్ను మీ ఆద్యగా చేసినందుకు థాంక్యూ ప్రశాంత్ సార్.. మీరు అసాధారణమైనవారు.. @actorprabhas యూఆర్ వెరీ లవబుల్.. అద్భుతమైన కోస్టార్ గా ఉన్నందుకు థాంక్యూ.. @hombalefilms టీమ్‌లోని అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో పని చేయడం చాలా బాగుంది” అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇక జనవరి 2021లో సెట్స్‌ మీదకు వెల్లిన ఈ మూవీని.. ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement