Friday, April 26, 2024

విక్ర‌మ్ ..కార్తీతో క‌లిసి పొన్నియిన్ సెల్వ‌న్ చూసిన క‌మ‌ల్ హాస‌న్-మ‌ణిర‌త్నంపై ప్ర‌శంస‌లు

హీరోలు విక్ర‌మ్..కార్తీల‌తో క‌లిసి విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రాన్ని చూశారు.అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం టీంపై క‌మ‌ల్ హాస‌లు పొగ‌డ్త‌లు కురిపించారు.ఈ చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపిన క‌మ‌ల్ హాస‌న్ పొన్నియ‌న్ మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ ఆదిత్య క‌రికాల‌న్ పాత్ర‌లో న‌టించ‌గా..కార్తీ వ‌ల్ల‌వ‌రాయ‌న్ వండియ‌దేవ‌న్ పాత్ర పోషించారు. ఐశ్వ‌ర్యారాయ్ నందినీగా, త్రిష కుంద‌వై పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెర‌కెక్కించాయి. పొన్నియ‌న్ సెల్వ‌న్‌ పార్టు-2 కూడా రానుంది.త‌మిళంతోపాటు ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో క‌లెక్ష‌న్లు రాబడుతూ నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రిలీజైంది. ఈ మూవీలో చియాన్ విక్ర‌మ్‌, నాజ‌ర్‌, ప్ర‌కాశ్ రాజ్‌, శ‌ర‌త్‌కుమార్‌, జ‌య‌రామ్‌, విక్ర‌మ్ ప్ర‌భు, కార్తీ, జ‌యం ర‌వి, పార్థీబన్‌, శోభితా ధూళిపాళ, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష కీల‌క పాత్ర‌లు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement