Friday, April 26, 2024

అక్రమసంబంధమే కారణం…. ఫ్రిజ్ లో దాచింది ప్రియుడే !!

జూబ్లీ హిల్స్ కార్మిక నగర్ లో జరిగిన సిద్ధికి అహ్మద్ (40) హత్య వివాహేతర సంబంధం నేపథ్యంలోనే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. జహీరాబాద్ కోహీర్ కు చెందిన సిద్ధికి కి సుమారు 9 ఏళ్ల క్రితం రుబీనాతో వివాహం జరిగింది. ప్రొఫెషనల్ టైలర్ గా జీవితాన్ని సాగిస్తున్న సిద్ధికి వివాహానంతరం శ్రీ రామ్ నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ సమయంలోనే అలీతో సిద్దికి భార్య కు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో పలుమార్లు భార్యాభర్తలకు ఘర్షణ తలెత్తింది. ఇద్దరు పిల్లలు ముఖం చూసైనా వివాహేతర సంబంధానికి ముగింపు పలకాలని సిద్ధికి పలుమార్లు కోరినా రుబీనా ప్రవర్తన మార్చుకోలేదు.

ఈ క్రమంలో రుబీనా శ్రీ రామ్ నగర్ లోని తన తల్లి వారి ఇంటికి వెళ్ళింది. రోజులాగానే షాపు మూసివేసిన సిద్ధికి గత నెల 30న అత్త వారింటికి వెళ్లి భోజనం ముగించుకుని కార్మిక నగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. సిద్దికి వెంటే ఫాలో అయిన అలీ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న సిద్ధికి తలపై రాడ్డు తో బలంగా కొట్టాడు. దీంతో సిద్ధికి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతి చెందిన అనంతరం సిద్ధికి భార్య రుబీనా తో వాట్సాప్ కాల్ మాట్లాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో రుబీనా నేరుగా పాల్గొనకపోయినా సహకరించడంతో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్డు. మృతుడి ద్విచక్ర వాహనం, నిందితుడి ద్విచక్ర వాహనము, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement