Thursday, April 25, 2024

హు కిల్డ్ బాబాయ్ – జ‌గ‌న్ ను ప్ర‌శ్నించిన నారా లోకేష్…

అమ‌రావ‌తి – మాజీ మంత్రి, వైఎస్ ఆర్ సోద‌రుడు వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగి రెండేళ్లు దాటిని ఇంత వ‌ర‌కు కేసులో ఎటువంటి పురోగ‌తి లేదు… మొద‌ట సిట్, ఆపై సిబిఐ విచార‌ణ జ‌రుపుతున్నా అస‌లు నిందితులు మాత్రం చిక్క‌డం లేదు.. దీనిపై వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఇటీవ‌ల ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, త‌న తండ్రి హ‌త్య కేసు విచార‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆరోపించారు.. దీనిపై టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స్పందిస్తూ, అందరూ అడిగినట్టే తాను కూడా అడుగుతున్నానని, హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్ చేశారు. “మీ చిన్నాన్నను మా నాన్న(చంద్ర‌బాబు) నరికేశాడన్నావు. దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు… చెప్పు అబ్బాయి!” అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. ఢిల్లీని గడగడలాడిస్తానన్న జ‌గ‌న్ ఈ హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు జగన్ గజగజా వణుకుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement