Monday, May 13, 2024

‘భద్రత కోసం’… ఆనందయ్యను వేకువజామున తరలించిన పోలీసులు

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆనందయ్య పేరే వినిపిస్తోంది ఆనందయ్య మందే కరోనా కి మెడిసిన్ అని చాలా మంది భావిస్తున్నారు అయితే తాజాగా భద్రతా కారణాలు పేరు చెబుతూ ఆనందయ్యని పోలీసులు ఇంటి నుంచి తరలించారు. వేకువజాము సమయంలో కృష్ణపట్నం పోర్ట్ కి ఆనందయ్య ను పోలీసులు తరలించారు. ఆనందయ్యకి భద్రత కల్పించడం కోసం తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

అయితే ఆనందయ్యని తరలించడం దారుణమని గ్రామస్థులు మండిపడుతున్నారు. కాగా రాత్రి ఆనందయ్య ఇంటి వద్దే గ్రామస్థులు అంతా కూడా నిద్రపోయారు.ఆనందయ్యని ఎందుకు నిర్బంధిస్తున్నారంటూ గ్రామస్థులు పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే మందు పంపిణీ అని ఆనందయ్య చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement