Saturday, July 27, 2024

Olympics | ఈషా సింగ్‌, మను భాకర్‌లకు ఒలింపిక్స్‌ కోటా

భోపాల్‌లోని ఎంపీ షూటింగ్‌ అకాడమీలో జరిగిన ఒలింపిక్స్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల విభాగం 25 మీటర్స్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ యువ సంచలనం ఈషా సింగ్‌తో పాటు మరో భారత స్టార్‌ మను భాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు.

పురుషుల విభాగంలో అనీష్‌ భన్వాలా, విజయ్‌వీర్‌ సిధులు కూడా ఒలింపిక్స్‌ కోటాను సొంతం చేసుకున్నారు. ఇక్కడ జరిగిన మహిళల 25మీ స్పోర్ట్స్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో ఇషా సింగ్‌ (586), మను భాకర్‌ (586) సమాన స్కోర్లతో టాప్‌లో నిలిచి ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు. పురుషుల విభాగం 25మీ రాపిడ్‌ ఫైర్‌ పిస్టర్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో అనీష్‌ భన్వాలా టాప్‌ ప్లెస్‌, విజయ్‌వీర్‌ సిధూ రెండో స్థానాన్ని దక్కించుకుని పారీస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement