Monday, May 13, 2024

పరారీలో భవ్య ఆనంద్‌ప్రసాద్

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భవ్య క్రియేషన్స్ అధినేత, ఆనంద్‌ ప్రసాద్‌ పరారీలో ఉన్నారు. పెట్టుబడుల పేరుతో మోసం చేశారని ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు భవ్య ఆనంద్ ప్రసాద్‌పై ఫిబ్రవరిలో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆనంద్ ప్రసాద్ కుమారుడు, కోడల్ని అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి భవ్య ఆనంద్‌ ప్రసాద్‌, ఆయన భార్య కృష్ణకుమారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మంది నుంచి రూ.100 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ బయటికి రావడంతో భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ వ్యవహారం సంచలనంగా మారింది. భవ్య క్రియేషన్స్ తాజాగా నితిన్ ‘చెక్’ సినిమా విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement