Wednesday, May 15, 2024

వీళ్లు మారరు అంతే.. బిర్యానీ ఉచితం అనగానే పోటెత్తిన జనం

ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యాని ఉచితం అనగానే జనాలు ఎగబడి కొనుగోలు చేయడం ప్రారంభించారు. కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఓ బిర్యానీ సెంటర్ వద్ద ఈ సీన్ చోటుచేసుకుంది.

కరోనా వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలు, అధికారులు ప్రజల్లో చైతన్యం రావడం కోసం నెత్తీ నోరు మొత్తుకుంటుంటే కడప జిల్లా బద్వేల్ పట్టణ జనాలు కొంతమంది కేవలం బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. ఇటువంటి వ్యక్తులను ఏమనాలో తెలియడం లేదు. ఒక్క పూట తినే తిండి కోసం జీవితాలు నాశనం అవుతాయి అన్న విషయం వీరికి ఎప్పుడు తెలుస్తుందో? పోలీసులు ఒకపక్క తరుముతున్నా బిర్యానీ ఎక్కడ అయిపోతుందో అన్న బాధతో ఎగబడి సిగ్గు లేకుండా మరీ కొనుగోలు చేస్తున్నారు. సామాజిక దూరం సంగతి దేవుడెరుగు. కనీసం మాస్కు కూడా లేకుండా కొంతమంది బిర్యానీ కోసం క్యూ కట్టారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement