Sunday, April 28, 2024

మంచినీటి, డ్రైనేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్‌లోని సింగాడికుంట, ముగ్గుబస్తీ, కామునికాంత తదితర బస్తీలలో మంచినీటి, డ్రేనేజి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముషీరాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. ఆయా బస్తీలలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని వివిధ బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసువచ్చారని ఆయన వెల్లడించారు. డివిజన్‌ పరిధిలోని వివిధ బస్తీలలో డ్రైనేజి, మంచినీరు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగిపోర్లుతోందని, మంచినీటి ఎద్దడి, తాగునీటిలో కలుషిత నీటి సరఫరా జరుగుతోందని ఆయన వెల్లడించారు. బస్తీలలోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జయసింహ్మా, శ్యాంయాదవ్‌, రాంచందర్‌, వల్లాల శ్రీనివాస్‌యాదవ్‌, సురేష్‌, శ్రీహరి, దుర్గస్వామి, వల్లాల రవి, జమాలోద్దిన్‌, ప్రవీన్‌, సత్యనారాయణ, విక్కీ, శివ, చందు, వాటర్‌ వర్క్స్‌ అధికారులు జిఎం, మహేష్‌, డిజిఎం చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement