Monday, May 6, 2024

పెగాస‌స్ హ్యాకింగ్ నివేదకలో రాహుల్, పీకే పేర్లు..

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని నివేదికలు రావడంతో కలకలం మొదలయింది. అయితే తాజగా ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీల ఫోన్‌పై కూడా పెగాసస్‌ నిఘా సాఫ్టేవర్‌తో ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 17 వార్త సంస్థలు పెగాసస్‌ ప్రాజెక్ట్‌ పేరుతో చేసిన పరిశోధనాత్మక కథనాలు తరువాతి భాగం ఇవాళ ప్రచురించగా.. ప్రశాంత్ కిషోర్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసిన విషయం నిజమేనని, ఆయన ఫోన్‌ను తాము అమ్నెస్టి ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్‌ వద్ద ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించినట్లు కొన్ని జాతీయ స్థాయి వెబ్‌సైట్లు రాశాయి..కాగా పెగాస‌స్ హ్యాకింగ్ నివేదిక‌పై ఇవాళ పార్ల‌మెంట్‌లోనూ దుమారం రేగింది.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement