Thursday, May 9, 2024

ఏక‌గ్రీవానికి స్వ‌స్తి..రెండు వ‌ర్గాల పోటీ..

ల‌క్క‌సాగ‌రం పంచాయ‌తీ ఆవిర్భావం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. కాగా నిన్న పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి..ఇది ఆరు ద‌శాబ్దాల త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌లు. క‌ర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీకి తొలిసారి రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో ఎన్నిక అనివార్యమైంది. లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీ ఎవరికి రిజర్వు అయినా ఇప్పటి వరకు గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామంలో 2,375 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష్మీదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గత సంప్రదాయానికి భిన్నంగా సర్పంచ్ పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో నిన్న జరిగిన ఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement