Thursday, May 2, 2024

Pakistan – బలూచిస్తాన్‌ లో బాంబ్ పేలుడు – 26 మంది మృతి

ఇస్లామాబాద్‌: నైరుతి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రెండు బాంబు పేలుళ్లు బుధవారం చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 26 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ ప్రతినిధి జన్‌ అచక్జాయ్‌ తెలిపారు.

ఈ ఘటనలో సుమారు 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను స్థానిక అస్పత్రికి పోలీసులు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక.. దేశంలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్‌ రేపు (గురువారం) జరగనున్న ఈ పేలుళ్లు స్వంతంత్ర అభ్యర్థి ఎన్నికల కార్యాలయం వద్ద జరగటం గమనార్హం

Advertisement

తాజా వార్తలు

Advertisement