Monday, April 29, 2024

ప్రశాంత్ నీల్‌తో సినిమాను ఖరారు చేసిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నాడు. ప్రస్తుతం కరోనా బారిన పడిన ఎన్టీఆర్.. కోలుకున్న అనంతరం వరుస షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్‌ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అతడు.. తరువాత కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే కావడం విశేషం. అనంతరం ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ హీరోగా ‘సలార్’ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమా షూటింగ్‌కు ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకుంటాడు. దీంతో ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు విషయంలో చాలామందికి అనుమానాలు వచ్చాయి.

కానీ తమ కాంబినేషన్‌లో సినిమా ఉందనే విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఎన్టీఆర్ ఓ మీడియా సంస్థతో ఫోన్‌లో మాట్లాడాడు. కెరీర్ పరంగా 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్న తాను, 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు చెప్పాడు. కొరటాల సినిమా పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నాడు. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్కులో బిజీగా ఉన్నాడని చెప్పాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ 19 నెలల పాటు జరిగిందని, ఈ సినిమా కోసం తాము చాలా కష్టపడ్డామన్నాడు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయని చెప్పాడు. కరోనా పరిస్థితులు నెలకొన్నా ఈ సినిమా దసరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement