Wednesday, May 8, 2024

ఫారెస్ట్‌ కళాశాలలో ప్రొఫెసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. సెప్టెంబర్​ 6నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ములుగు అటవీ కళాశాలలో ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 27 పోస్టుల్లో ప్రొఫెసర్‌ పోస్టులు-2, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు-4, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు-21 ఉన్నాయి. అయితే వీటికి ఆన్‌లైన్‌ దరఖాస్తులను సెప్టెంబర్‌ 6 నుంచి 27 వరకు స్వీకరించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement